కుమ్రంభీం ఆసిఫాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన కాగజ్ నగర్ పట్టణంలోని సంజీవయ్య కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఓ మహిళ(45) ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని సిర్పూర్ టీ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
పెద్దపల్లి జిల్లాలో..కరోనాతో అటెండర్ మృతి
భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత