పెద్దపల్లి : కరోనాతో గోదావరిఖని మున్సిపల్ కోర్టులో అటెండర్గా (అవుట్ సోర్సింగ్) పని చేస్తున్న నరేష్ కుమార్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్గా తేలడంతో అతడిని చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు.