కోల్కతా: ప్రస్తుతం దేశంలో కరోనా కట్టడిలో తోడ్పడే రెమ్డిసివిర్ మెడిసిన్కు, ఆక్సిజన్కు తీవ్ర కొరత ఉన్నదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి వ్యాఖ్యానించారు. పశ్చమబెంగాల్లో ఆరో విడుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఓ సభలో మాట్లాడిన మమత.. ఇప్పుడు దేశంలో రెమ్డిసివిర్ మెడిసిన్ సరిపడా లేదని, అయినా ప్రధాని మోదీ మాత్రం తన గొప్ప కోసం 80 దేశాలకు ఆ ఔషధాన్ని సరఫరా చేశారని ఎద్దేశా చేశారు.
ప్రధాని మోదీ విదేశాలకు మెడిసిన్ను అమ్ముకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ దానికి ముందు దేశానికి సరిపడా మెడిసిన్ను సమకూర్చి పెట్టాలని మమత సూచించారు. ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా తనకు గొప్ప పేరు వస్తుందన్న ఒకే ఒక్క స్వార్థంతో దేశంలో సరిపడా స్టాక్ లేకున్నా విదేశాలకు రెమ్డిసివిర్ తదితర ఔషధాలను సరఫరా చేశారని ఆమె విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం.. వీడియో
కమలా హారిస్ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో