మూసాపేట (మహబూబ్నగర్) : మూసాపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఎస్ఐ పర్వతాలు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జానంపేటకు చెందిన కావలి రాములు (35)కు కొంతకాలంగా తిమ్మాపూర్కు చెందిన వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ విషయంపై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. మరో సారి తప్పు జరుగకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. అయితే గురువారం తెల్లవారుజామున కావలి రాములు నేరుగా ఆ మహిళ ఇంటికే వెళ్లడంతో క్షణికావేశానికి గురైన ఆమె భర్త పట్టుకొని కట్టేసి కొట్టడంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. దాడి చేసిన వారిలో భర్తతో పాటు మరో ముగ్గురు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.