రాజన్న సిరిసిల్ల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తంగళ్లపల్లిలో తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు బండి శేఖర్ (53) మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..శుక్రవారం సాయంత్రం యధావిధిగా కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. కాగా, హఠాత్తుగా ఉరుములు, మెరుపులతో పిడుగులు పడ్డాయి.
దీంతో భయాందోళనకు గురైన శేఖర్ తాటి చెట్టు పై నుంచి జారి కింద పడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శేఖర్ను హుటాహుటిన హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
శేఖర్ మృతితో తంగళ్లపల్లిలో విషాదం నెలకొంది. శేఖర్కు భార్య స్వరాజ్యం, ఇద్దరు కొడుకులు జగదీష్, చింటు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
ఇవి కూడా చదవండి..
మళ్లీ పెట్రో మంట.. హైదరాబాద్లో సెంచరీకి చేరువలో డీజిల్ ధర
Road accident | జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఒకరి మృతి
గోదావరిలో కొట్టుకుపోయిన యువకుడు..కాపాడిన మత్స్యకారులు