జయశంకర్ భూపాలపల్లి (చిట్యాల) : కల్వర్టును ట్రాక్టర్ ఢీకొని డ్రైవర్ మృతి చెందిన ఘటన జిల్లాలోని చిట్యాల మండలం నైన్పాక గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రేగొండ మండలం రామన్నగూడెం తండాకు చెందిన మూడ రాకేష్ (18)
ఇసుక రవాణా చేసేందుకు కాల్వపల్లి శివారు మానేరు వాగుకు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం నైన్పాక గ్రామ శివారులోని మోరంచ వాగు వద్ద కల్వర్టును ఢీకొని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన లారీ..
జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విధ్వంసం
Hyderabad | భర్తకు మద్యం తాగించి భార్యపై హత్యాచారం