మంచిర్యాల : జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. వేమనపల్లి మండలం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఎనుముల శంకర్పై పెద్దపులి దాడి చేసి గాయపరిచింది. మేకల కాపరి అయిన శంకర్ మేకలను మేపుకొని ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గ్రామానికి అతి సమీపంలో ఈ ఘటన జరగడంతో గ్రామస్తులు భయందోళనలకు గురి అవుతున్నారు.
పులి దాడిలో గాయాల పాలైన శంకర్ను వైద్యం కోసం మంచిర్యాల దవాఖనకు తరలించారు. పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Nizamabad incident | అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితుల అరెస్ట్
Crime news | భూ తగాదాలో తండ్రిని చంపిన తనయులు
Nizamabad | గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి
పింక్ టెస్ట్లో అదరగొడుతున్న అమ్మాయిలు.. స్మృతి హాఫ్ సెంచరీ