కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఎద్దుపై పులి దాడి చేయడంతో స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని పెంచికల్పేట్ మండలం లోడ్పల్లి గ్రామ సమీపంలో మంగళవారం మేతకు వెళ్లిన ఎద్దుపై పెద్దపులి దాడిచేసింది. ఎద్దు అరవడంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లి కేకలు వేయడంతో దానిని వదిలి అడవిలోకి వెళ్లిపోయింది. గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పులి అడుగులను గుర్తించి నిర్ధారించారు. అనంతరం తీవ్రంగా గాయపడ్డ ఎద్దుకు ప్రథమ చికిత్స చేశారు. పులి సంచరిస్తున్న నేపపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇవి కూడా చదవండి..
ఉడుముల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
విద్య ద్వారానే సమాజంలో మార్పు : ఎమ్మెల్సీ కవిత
రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
ప్రజలకు సుపరిపాలన అందించేందుకే కలెక్టరేట్ల నిర్మాణం
పల్లె ప్రగతి పెండింగ్ పనులు 19 లోపు పూర్తి చేయాలి