కరీంనగర్ (గంగాధర్) : తన ద్విచక్ర వాహనాన్ని ఓవర్ టేక్ చేశారే కోపంతో బస్సు అద్దాలను గుర్తు తెలియని యువకుడు పగుల గొట్టిన సంఘటన గంగాధర సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో గంగాధర సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని ఓవర్ టేక్ చేసింది.
దీంతో బైక్ పై వెళ్తున్న యువకునికి కోపం వచ్చింది. తన వాహనాన్ని వేగంగా తీసుకువెళ్లి బస్సుకు అడ్డుకా నిలిపాడు. బస్సు ఓవర్ టేక్ చేసే సమయంలో ప్రమాదం జరిగేదని, జరగరానిది జరిగితే ఎవరు భాద్యలు అని బస్సు డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు.
బస్సులో ఉన్నవారు సర్ది చెప్పడంతో బైక్ను అడ్డు తొలగించాడు. బస్సు వెళ్తున్న క్రమంలో అసంతృప్తిగా ఉన్న యువకుడు రాయిని విసరడంతో బస్సు వెనుక అద్దాలు పగిలిపోయి అందులో ఉన్న వారు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో డ్రైవర్ నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. యువకునిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Road accident | జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Sangareddy | ట్రైనీ నర్స్ను లైంగికంగా వేధించిన వైద్యుడి సస్పెన్షన్
సంగారెడ్డి జిల్లాలో విషాదం.. కలహాలతో కుటుంబం ఆత్మహత్య
Corona | జగిత్యాల పట్టణంలో ఏడో తరగతి విద్యార్థికి కరోనా