కరీంనగర్ : జిల్లాలోని ఇల్లందకుంట మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన బక్కతట్ల రాజయ్య (45)అనే గొర్రెల కాపరి పిడుగుపడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజు మాదిరిగానే రాజయ్య ఆదివారం గొర్రెలను మేతకు తోలుకపోయాడు. రాత్రి గ్రామంలోని ఓ రైతు పొలంలో మంద పెట్టి సైకిల్పై ఇంటికి బయిదేరాడు.
ఈ సమయంలో ఈదురుగాలులు వీచాయి. ఈ క్రమంలో రాజయ్యపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైతులు వ్యవసాయ పనులకు వెళ్లి వస్తున్న సమయంలో రాజయ్య మృతి చెందగా, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య సుశీల, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం
శాస్త్రబద్దంగా యాదాద్రి శివాలయ నిర్మాణం
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఆక్సిజన్ మిగులు నిల్వల ఏర్పాటు : కేంద్రానికి సుప్రీం ఆదేశం