హైదరాబాద్ : నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ అన్న సొంత చెల్లెలిని కిరాతకంగా కత్తితో గొంతు కోసి చంపాడు. ఈ విషాదకర ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధి టోలీచౌకీలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..మృతురాలు ఫాతిమా(42) ను ఆస్తి గొడవల వల్లే సొంత అన్న ఆరీఫ్ (35) చంపాడని పోలీసులు తెలిపారు. కొన ఊపిరితో ఉన్న ఫాతిమాను చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు చికిత్స పొందుతూ ఫాతిమా మృతి చెందింది. కాగా, ఫాతిమా నాంపల్లి క్రిమనల్ కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నది. కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితుని వేటలో ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
హుజూరాబాద్లో వీధి రౌడీల్లా రెచ్చిపోతున్న బీజేపీ శ్రేణులు
మీరాబాయికి మరో బంపర్ ఆఫర్.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ
ఈటలపై పెల్లుబికుతున్న దళితాగ్రహం
కొండగట్టులో నవీన్ మిట్టల్ ప్రత్యేక పూజలు