కరీంనగర్ : జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంలో కొందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గుండాల్లా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వీధి రౌడిల్లా వ్యవహరిస్తున్నారు. హుజూరాబాద్ పట్టణం టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి ప్రయత్నించారు. దళిత బంధు పథకాన్ని, దళితులను కించ పర్చే విధంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావ మరిది మధుసుదన్ రెడ్డి వాట్సప్ చాటింగ్ చేయడాన్ని నిరసిస్తూ కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు హుజూరాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో దిష్టి బొమ్మ దహనం చేస్తుండగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.
దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు రువ్వుకున్నారు. అంతేకాకుండా ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కాగా ఈటల రాజేందర్ బావమరిది వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లాలో దళితులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితుల ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈటల దిష్టి బొమ్మతో పాటు అతని బావ మరిది దిష్టి బొమ్మలను దళితులు, టీఆర్ఎస్ నాయకులు దహనం చేస్తున్నారు.
వీణవంక, ఇల్లందకుంట, హుజూరాబాద్ తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో దళితులు ఈటల దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహించారు. ఈటల ఖబర్దార్..హద్దుమీరి అనైతికంగా ప్రవరిస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
మీరాబాయికి మరో బంపర్ ఆఫర్.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ
Tokyo Olympics: స్విమ్మింగ్ రిలే ఈవెంట్లో చైనీస్ టీమ్ వరల్డ్ రికార్డ్
కొండగట్టులో నవీన్ మిట్టల్ ప్రత్యేక పూజలు