సిద్దిపేట : జిల్లాలోని కోహెడ మండలం సముద్రాల గ్రామంలో భూతగాదాల విషయంలో తండ్రి అట్ల కనకయ్య (58)ని హత్య చేసిన అట్ల వీరేందర్ అనే వ్యక్తిని హుస్నాబాద్ సర్కిల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ విషయంపై హుస్నాబాద్ సర్కిల్ కార్యాలయంలో ఏసీపీ మహేందర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏసీపీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సముద్రాల గ్రామానికి చెందిన అట్ల కనకయ్యకు కుమారుడు వీరేందర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇతనికి ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. అప్పటికే ఉన్న అప్పులతో పాటు భూమి విషయంలో తరచూ తండ్రీ, కొడుకులకు గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 26వ తేదీన ఉదయం ఏడు గంటల ప్రాంతంలో వ్యవసాయ భూమి వద్దకు వెళ్లిన కనకయ్యతో గొడవ పడిన వీరేందర్ అక్కడే ఉన్న పారతో కనకయ్య తలపై బలంగా కొట్టడమే కాకుండా కిందపడిపోయిన అతని గొంతు నులిమి హత్య చేశాడు. చెట్టుపై నుంచి పడిపోయాడని బంధువులకు ఫోన్ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
కనకయ్య పెద్దకుమార్తె మాదన సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐ రఘుపతిరెడ్డి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి సోమవారం పట్టుకొని అరెస్టు చేశారు. నిందితుడు ఉపయోగించిన పారతోపాటు ఒక బైకును సీజ్ చేశామని, నిందితుడు వీరేందర్ను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ వివరించారు. సమావేశంలో సీఐ రఘుపతిరెడ్డి, పీఎస్ఐ విజయ్కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను చంపి భర్త ఆత్మహత్య
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్మెడల్స్.. ఆర్చరీ రికర్వ్లో వరల్డ్ నంబర్ వన్ దీపికా
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం