న్యూఢిల్లీ: హర్యానాలో పాఠశాలలకు వేసవి సెలవులను మరో 15 రోజులు పొడిగించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం మే 31తో వేసవి సెలవులు ముగిసి, జూన్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో సెలవులను మరో 15 రోజులు పొడిగించాలని హర్యానా పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
ఈ సెలవుల పొడిగింపు నిర్ణయం హర్యానాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉపాధ్యాయులు సహా ఇతర సిబ్బంది జూన్ 1 నుంచే 50 శాతం కెపాసిటీకి మించకుండా పాఠశాలలకు హాజరుకావాలని ఆదేశించింది.