రాజన్న సిరిసిల్ల : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వివరాలను వెల్లడించారు. సిరిసిల్లలోని రగుడు వద్ద గల రేవతి రైస్ మిల్లు నుంచి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.
అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 58 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
విద్య ద్వారానే సమాజంలో మార్పు : ఎమ్మెల్సీ కవిత
రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం
ప్రజలకు సుపరిపాలన అందించేందుకే కలెక్టరేట్ల నిర్మాణం
పల్లె ప్రగతి పెండింగ్ పనులు 19 లోపు పూర్తి చేయాలి