ఉండవల్లి/ జోగులాంబ గద్వాల : ఎలాంటి పత్రాలు లేకుండా వెండిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన పంచలింగాల వద్ద సోమవారం చోటు చేసుకున్నది. ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, సీఐ లక్ష్మీదుర్గయ్య కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా శివపేటకు చెందిన ఉదయ్కుమార్ ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి బెంగళూర్కు 25 కేజీల వెండి బిస్కెట్లు, పాత పట్టీలతో ప్రయాణిస్తున్నాడు.
పంచలింగాల చెక్పోస్ట్ వద్ద పోలీసులు బస్సును తనిఖీ చేయగా.. అతని వద్ద ఉన్న వెండిని గుర్తించారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వెండిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నేలకొరిగిన సాహితీ శిఖరం : మంత్రి జగదీష్ రెడ్డి
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
వేములవాడలో కరోనాతో అర్చకుడి మృతి
కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం