కుమ్రం భీమ్ ఆసీఫాబాద్ : జిల్లాలోని వాంకిడి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 15 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను జిల్లా అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర్ రావు మీడియాకు వెల్లడించారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. తనీఖీల్లో ఒకరు పట్టుబడగా మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. దీని విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ములుగు జిల్లాలో బాలికపై లైంగికదాడి
టీకాల కొరత : కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నిరు పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
నారింజ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద