హత్నూర, జూలై 8 : ఒకప్పుడు ఆ పల్లె సమస్యలకు నిలయంగా ఉండేది.. గ్రామంలో అడుగు పెడితే మురికి కాల్వలు, పారిశుధ్యలోపం, అధ్వానంగా రోడ్లు, ఎక్కడా చూసిన చెత్తచెదారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ, నేడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. పచ్చదనం ఫరిఢవిల్లేలా మొక్కల పెంపకం.. ఆహ్లాదంగా సేదతీరేందుకు పల్లె ప్రకృతి వనం.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా డంపింగ్యార్డు, వర్మీకంపోస్ట్ షెడ్ల ఏర్పాటు.. ఆటంకాలు లేకుండా అంత్యక్రియలు నిర్వహించేలా వైకుంఠధామంతో నేడు హత్నూర మండలం గోవిందరాజ్పల్లి గ్రామం ప్రగతి దిశలో పయనిస్తోంది. ప్రతి నెలా గ్రామపంచాయతీకి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుండడంతో పల్లె ముఖ చిత్రమే మారిపోయింది. ఏపుగా పెరిగిన మొక్కలు.. పల్లెకు పచ్చలాహారాన్ని తొడగగా.. పరిశుభ్రత చర్యలతో రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. కొత్త కాంతులు వెదజల్లుతున్న పల్లెను చూసి గ్రామ ప్రజలు మురిసిపోతున్నారు.
హత్నూర, జూలై 8 : ఒకప్పుడు ఆ పల్లె సమస్యలకు నిలయంగా ఉండేది.. గ్రామంలో అడుగు పెడితే మురికి కాల్వలు, పారిశుధ్యలోపం, అధ్వానంగా రోడ్లు, ఎక్కడా చూసిన చెత్తచెదారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ, నేడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. పచ్చదనం ఫరిఢవిల్లేలా మొక్కల పెంపకం.. ఆహ్లాదంగా సేదతీరేందుకు పల్లె ప్రకృతి వనం.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా డంపింగ్యార్డు, వర్మీకంపోస్ట్ షెడ్ల ఏర్పాటు.. ఆటంకాలు లేకుండా అంత్యక్రియలు నిర్వహించేలా వైకుంఠధామంతో నేడు హత్నూర మండలం గోవిందరాజ్పల్లి గ్రామం ప్రగతి దిశలో పయనిస్తోంది. ప్రతి నెలా గ్రామపంచాయతీకి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుండడంతో పల్లె ముఖ చిత్రమే మారిపోయింది. ఏపుగా పెరిగిన మొక్కలు.. పల్లెకు పచ్చలాహారాన్ని తొడగగా.. పరిశుభ్రత చర్యలతో రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. కొత్త కాంతులు వెదజల్లుతున్న పల్లెను చూసి గ్రామ ప్రజలు మురిసిపోతున్నారు.
హత్నూర, జూలై 8 : ఒకప్పుడు ఆ పల్లె సమస్యలకు నిలయంగా ఉండేది.. గ్రామంలో అడుగు పెడితే మురికి కాల్వలు, పారిశుధ్యలోపం, అధ్వానంగా రోడ్లు, ఎక్కడా చూసిన చెత్తచెదారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ, నేడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. పచ్చదనం ఫరిఢవిల్లేలా మొక్కల పెంపకం.. ఆహ్లాదంగా సేదతీరేందుకు పల్లె ప్రకృతి వనం.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా డంపింగ్యార్డు, వర్మీకంపోస్ట్ షెడ్ల ఏర్పాటు.. ఆటంకాలు లేకుండా అంత్యక్రియలు నిర్వహించేలా వైకుంఠధామంతో నేడు హత్నూర మండలం గోవిందరాజ్పల్లి గ్రామం ప్రగతి దిశలో పయనిస్తోంది. ప్రతి నెలా గ్రామపంచాయతీకి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుండడంతో పల్లె ముఖ చిత్రమే మారిపోయింది. ఏపుగా పెరిగిన మొక్కలు.. పల్లెకు పచ్చలాహారాన్ని తొడగగా.. పరిశుభ్రత చర్యలతో రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. కొత్త కాంతులు వెదజల్లుతున్న పల్లెను చూసి గ్రామ ప్రజలు మురిసిపోతున్నారు.
గ్రామస్వరూపం..
గ్రామంలో మొత్తం 1200 జనాభా ఉండగా.. అందులో 820 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 400, స్త్రీలు 420 మంది ఉన్నారు. గ్రామంలో 8వార్డులు ఉండగా, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఉన్నాయి.
చేపట్టిన అభివృద్ధి పనులు..
ప్రభుత్వం పల్లెప్రగతి పనులు ప్రారంభించడంతో గ్రామంలో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. నిలిచిపోయిన పంచాయతీ భవనాన్ని పునర్నిర్మించి చూడముచ్చటగా తీర్చిదిద్దారు. భవనం చుట్టూ మొక్కలు పెట్టడమే కాకుండా వాకింగ్ట్రాక్ను ఏర్పాటు చేశారు. గ్రామంలోని మూడు శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లను కూల్చి, మురికి కూపాలను పూడ్చివేశారు. కొత్తగా 25 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి 85 ఎల్ఈడీ బల్బులను బిగించారు. రూ.9లక్షలతో 450 మీటర్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టారు. రూ.4లక్షలతో మురుగు కాల్వను నిర్మించారు. రూ.12లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనం నిర్మిస్తున్నారు. పనులు కొనసాగుతున్నాయి.
వైకుంఠధామం..
పరిశుభ్ర పల్లెగా తీర్చిదిద్దేందుకు చెత్త సేకరణ కోసం ప్రభుత్వం పంచాయతీకి ట్రాక్టర్ను సమకూర్చింది. దీంతో పారిశుధ్య కార్మికులు ప్రతి రోజూ ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.
డంపింగ్ యార్డు,పల్లె ప్రకృతి వనం..
చనిపోయిన వారికి ఆత్మీయ వీడ్కోలును గౌరవంగా నిర్వహించుకునేలా ప్రభుత్వం గ్రామంలో అన్ని హంగులతో కూడిన వైకుంఠధామాన్ని నిర్మించింది. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనం ఎంతో చూడముచ్చగా ఉంది. ప్రకృతివనం చుట్టూ రోడ్డును ఏర్పాటు చేశారు. ప్రకృతి వనంలో 8వేల మొక్కలు నాటడంతో అవి ఏపుగా పెరుగుతున్నాయి. గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి 20వేల మొక్కలు పెంచుతున్నారు.
అందరి సహకారంతో అభివృద్ధి..
ప్రభుత్వం నుంచి నిధులు పుష్కలంగా వస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్నం. వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మాణాలను పూర్తి చేశాం. పల్లె ప్రకృతి వనంతో ప్రజలకు ఆహ్లాదం అందుబాటులోకి వచ్చింది. నిరంతరం పారిశుధ్య చర్యల చేపడుతూ.. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం.
హరితహారంపై ప్రత్యేక దృష్టి..
హరితహారంలో నాటిన మొక్కలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఏపుగా పెరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పెద్దసమస్య తీరింది. గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం.