హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో పొడిచి పాశవికంగా అతడిని హతమార్చారు. మైలార్దేవుపల్లి పరిధిలోని ముస్తఫానగర్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మృతుడిని నగరంలోని పాతబస్తీ పరిధిలోని కాలాపత్తర్కు చెందిన జాబేర్గా పోలీసులు గుర్తించారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అనేక కేసుల్లో జాబేర్ నేరస్తుడిగా ఉన్నట్లు తెలిసింది. ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.