హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధించింది. దీనిని పోలీసులు అమలు చేస్తున్నారు. అయితే కర్ఫ్యూ విషయంలో ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. హైదరాబాద్ రాత్రి కర్ఫ్యూ సందర్భంగా లాఠీఛార్జీ చేశారంటూ నకిలీ వీడియోను తమ చానల్లో పోస్టు చేశాడు. దీంతో సదరు రిపోర్టర్పై పోలీసులు కేసు నమోదుచేశారు. రాత్రి కర్ఫ్యూలో పోలీసులు లాఠీఛార్జీ చేశారని యూట్యూబ్లో నకిలీ వీడియో పోస్టు చేసిన రిపోర్టర్పై కేసు రిజిస్టర్ చేశామని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..