నల్లగొండ : నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని 18 మంది యువకులను మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి కటకటాలకు పంపించారు. నల్లగొండ వన్ టౌన్ సీఐ నిగిడాల సురేష్ వివరాలను మీడియాకు వెల్లడించారు. నల్లగొండ వన్ టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న మేడే శాంతి కుమార్ స్ఫూర్తి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పేరుతో ప్రభుత్వ శాఖలలో అవుట్ సోర్స్ విధానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 18 మంది నిరుద్యోగుల నుంచి 11.75 లక్షలు వసూలు చేశాడు.
వారికి ఉద్యోగాలు ఇప్పించకుండా తిప్పుతూ మోసాలకు పాల్పడ్డట్లు తెలిపారు. ఇతడిపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు, నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు అయిందన్నారు.
కాగా, మొత్తం మూడు కేసులకు సంబంధించి నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో విచారణ చేసి నిందితుడు మోసాలకు పాల్పడ్డాడని నిర్ధారించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఏ.వీ రంగనాధ్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేసి శనివారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించామని సీఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి…
ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
సింగరేణిలో కొవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు
తడిసిన ధాన్యాన్ని కొంటాం : మంత్రి ఎర్రబెల్లి
మార్స్ గ్రహంపై దిగిన చైనా రోవర్
ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన సేవలందించాలి