నల్లగొండ : టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఉత్పత్తుల పేరుతో కోట్ల రూపాయలను పలువురి నుంచి తీసుకొని మోసం చేసిన వారిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. టూ టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి కథనం మేరకు..శివాజీ నగర్కు చెందిన స్వాతి, పార్వతి అనే మహిళతో కలిసి శివాజీ నగర్తో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారికి టప్పర్ వేర్తో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి మోసం చేశారు.
బాధితులు జిల్లా ఎస్పీ ఏ.వీ రంగనాధ్ను సంప్రదించారు. ఎస్పీ ఆదేశంతో కేసు నమోదు చేసి నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో విచారణ చేశారు. నేరం రుజువు కావడతో పీడీ యాక్ట్ నమోదు చేసి టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ