వరంగల్ అర్బన్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణాకు పాల్పడతున్న ఒక మహిళతో సహ నలుగురు గంజాయి స్మగ్లర్లపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న కొండి శెట్టి సత్యనారాయణ, ఇస్లావత్ వినోద్ కుమార్ ఆజ్మీరా రమాదేవి, బస్పంగు ప్రవీణ్పై వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదివారం పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు.
సీపీ జారీచేసిన ఉ త్తర్వులను వర్ధన్నపేట సీఐ విశ్వేశ్వర్ వరంగల్ కేంద్రకారాగారంలో ఉన్న నిందితులకు జైలు అధికారుల సమక్షంలో పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేసారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ ను నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
మండపంలో పెండ్లి కూతురు.. పోలీసు వాహనంలో తల్లిదండ్రులు
పోలీసులమని బెదిరించి.. బంగారం దోచుకెళ్లిన దుండగులు
దారుణం : హత్యకు దారి తీసిన భూ తగాదా
బాధ్యతగా పని చేయండి : మంత్రి హరీశ్ రావు
ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం
నెక్కొండ పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే పెద్ది
యాదాద్రిలో ప్రారంభమైన నృసింహుడి జయం