నిర్మల్ : వ్యానును లారీ ఢీకొన్న దుర్ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. ఈ విషాద సంఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్లో బుధవారం చోటుచేసుకుంది. సోన్ సబ్ ఇన్స్పెక్టర్ జ్యోతి మణి తెలిపిన వివరాల ప్రకారం మృతుడిని పెద్దపల్లి జిల్లాకు చెందిన ప్రవీణ్(30)గా గుర్తించారు. హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై వ్యాన్ పార్క్ చేసి అడ్రస్ కోసం అడుగుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు.