ఊట్కూర్, జూలై 8 : పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ హరిచందన అన్నారు. మండలంలో కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమానికి గురువారం హా జరై అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. స్థానిక చెక్పోస్టు నుంచి గ్రామంలోకి దారి పొడవునా రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశా రు. గ్రామ దేవత ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటా రు. డంపింగ్ యార్డు, ప్రకృతి వనాన్ని సందర్శించి పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి వర్మీకంపోస్టు ఎరువుల తయారీ బాధ్యతను ఉత్సాహంగా పని చేసే మహి ళా గ్రూపు సభ్యులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కా వాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, తాసిల్దార్ తిరుపతయ్య, ఎంపీటీసీ హ న్మంతు, ఎంపీడీవో కాళప్ప, కార్యదర్శి జాన్, ఉపాధి ఏపీ వో నర్సయ్య, ఈసీ శ్రీనివాసులు, అంగన్వాడీ టీచర్లు, పం చాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కలు పంపిణీ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప ల్లె ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయా గ్రామాల సర్సంచులు కోరారు. మండలంలోని ఐనాపూర్, హిందుపూర్, కున్సీ తదితర గ్రామాల్లో ప్రజాప్రతినిథులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచు లు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత ఉందన్నారు. మొక్కలు నాటి పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిందన్నా రు. కార్యక్రమంలో నాయకులు, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
కంపచెట్ల తొలగింపు
పల్లె ప్రగతిలో భాగంగా ఆ యా గ్రామాల్లో జోరుగా పారిశుధ్యం పనులు కొనసాగుతున్నాయి. మండలంలోని కర్ని, ఖానాపురం, చిట్యాల, వన్నయ్యకుంట తదితర గ్రామాల్లో కంపచెట్లను తొలగించి, పరిసరాలను పరిశుభ్రం చేశారు. అలాగే హరితహారంలో భా గంగా వన్నయ్యకుంటలో ఎంపీడీవో శ్రీధర్, వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాఠశాలు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంపీఆర్డీవో పావని, సర్పంచ్ రాధ, ఎంపీటీసీ తిమ్మప్ప పాల్గొన్నారు.
ముమ్మరంగా పారిశుధ్య పనులు
మండలంలోని అం త్వార్, పిల్లిగుండ్లతండా, జాజాపూర్, సింగారం, శాసన్పల్లి, పేరపళ్ల, మీదితండా తదితర గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో మొక్కలు నాటడం, కంపచెట్లను తొలగించడం, మొక్కలు పంపిణీ చేయడంతోపాటు పారిశుధ్య పనులు చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.