భువనేశ్వర్ : వ్యభిచార వృత్తిని కొనసాగించేందుకు భార్య నిరాకరించడంతో ఆమెపై దారుణానికి ఒడిగట్టిన భర్త ఉదంతం ఒడిషాలో వెలుగుచూసింది. బాధితురాలికి పదేండ్ల కిందట నిందితుడు చందన్ ఆచార్యతో వివాహమైంది. డబ్బు కోసం రాత్రి వేళల్లో వ్యభిచారం చేయాలని భర్త తనను వేధిస్తున్నాడని మహిళ చంద్రశేఖర్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నుంచి నడుపుతున్న వ్యభిచార దందాలోకి దిగాలని ఐదురోజుల కిందట తన భర్త ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించారు. ఈ క్రమంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన నిందితుడు ఇనుప రాడ్తో ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఆపై ఆమె జననాంగంలో మద్యం బాటిల్ చొప్పించడంతో బాధితురాలు స్పృహ కోల్పోయారు.
భర్త అరాచకంపై బాధితురాలు తన తల్లికి వివరించి కుటుంబ సభ్యులతో కలిసి చందన్ ఆచార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెండ్లయిన మూడేండ్ల నుంచి తనను వ్యభిచారం చేయాలని బలవంతపెడుతూ ఏడేండ్లుగా ఈ వృత్తిలో తనను భాగస్వామ్యం చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపారు. వ్యభిచారం చేసేందుకు తాను నిరాకరించిన ప్రతిసారీ దారుణంగా కొట్టేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆటోడ్రైవర్గా పనిచేసే ఆచార్య భార్య, ఐదేండ్ల కుమార్తెతో చంద్రశేఖర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మావతి విహార్లో నివసిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.