హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం రాష్ట్రం నుంచి కెనడాకు వెళ్లిన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా డిండి మండలం ఆకుతోటపల్లికి చెందిన ప్రవీణ్ రావు ఉన్నత విద్య అభ్యసించడానికి 2015లో కెనడాకు వెళ్లాడు. ఈక్రమంలో ఇవాళ భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుకున్న తల్లిదండ్రులు నారాయణారావు, హైమావతి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, సాధారణ రైతు కుటుంబానికి చెందిన ప్రవీణ్ రావు.. ఉన్నతాశయాలతో విదేశాలకు వెళ్లాడని.. కానీ తన లక్ష్యం నెరవేరకముందే ప్రాణాలొదలడంపై ఆయన కుటుంబీకులు, గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..