కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఆరెంజ్ సిటీలో బుధవారం సాయంత్రం కాల్పులు కలకలం సృష్టించాయి. ఆరెంజ్ సిటీలోని లికోయిన్ అవెన్యూ ఆఫీస్ కాంప్లెక్స్లో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న వ్యక్తి పోలీసుల ఫైరింగ్లో గాయపడ్డాడు. దీంతో అతన్ని దవాఖానకు తరలించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరెంజ్ సిటీ పోలీస్ అధికార ప్రతినిధి తెలిపారు.
కాగా, వారంరోజుల క్రితం బౌల్డర్ని సూపర్ మార్కెట్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో పది మంది మరణించిన విషయం తెలిసిందే. అదేవిధంగా గత నెల ప్రథమార్ధంలో అట్లాంటాలోని స్పాలలో ఆసియా మహిళలే లక్ష్యంగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఎనిమిది మంది మరణించగా.. అందులో ఆరుగురు ఆసియన్లే ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..