ముంబై : ఆన్లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు (cyber fraud) చెలరేగుతున్నారు. అమాయకుల బ్యాంకు ఖాతాల నుంచి క్షణాల్లోనే అందినకాడికి దోచేస్తున్నారు. లేటెస్ట్గా ముంబైకి చెందిన మహిళ (65) సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఆన్లైన్లో కరెంట్ బిల్లు చెల్లిస్తూ ఫేక్ ఎస్ఎంఎస్కు స్పందించడంతో ఆమె ఏకంగా రూ. 7 లక్షలు పోగొట్టుకున్నారు. ముంబైలోని అంధేరి ప్రాంతానికి చెందిన మహిళ మొబైల్ ఫోన్కు ఆమె భర్త పేరిట కరెంట్ బిల్లు బకాయికి సంబంధించిన ఎస్ఎంఎస్ వచ్చింది.
బిల్లును వెంటనే చెల్లించకుంటే ఇంటికి విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని ఎస్ఎంఎస్ పేర్కొంది. ఎస్ఎంఎస్తో పాటు పేమెంట్ చేసేందుకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ వివరాలు ఉన్నాయి. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఎస్ఎంఎస్గా భావించిన మహిళ సదరు నెంబర్కు కాల్ చేసింది. కాల్ను స్వీకరించిన గుర్తుతెలియని వ్యక్తి తాను అదానీ ఎలక్ట్రిసిటీ కార్యాలయ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. బిల్లు చెల్లించడంలో తాను సహకరిస్తానని నమ్మబలికిన వ్యక్తి ఆమెను టీం వ్యూయర్ క్విక్ సపోర్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆమెను కోరాడు.
బాధితురాలు ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోని ఐడీ, పాస్కోడ్ ఇవ్వడంతో కాలర్కు ఆమె మొబైల్ ఫోన్ యాక్సెస్ లభించింది. ఆపై రూ. 4,62,959, రూ. 1,39,900, రూ. 89,000 ఆమె ఖాతా నుంచి డెబిట్ కాగా మొత్తం రూ. 6,91,859 బాధితురాలి ఖాతా నుంచి కట్ అయినట్టు మూడు ఎస్ఎంఎస్లు వచ్చాయి. పెద్దమొత్తంలో లావాదేవీలు జరగడంతో అనుమానం వచ్చిన ఎస్బీఐ ఫ్రాడ్ మేనేజ్మెంట్ టీం బాధితురాలిని సంప్రదించగా తానెలాంటి లావాదేవీలు చేపట్టలేదని ఆమె బదులిచ్చారు. ఆపై మోసపోయానని గుర్తించిన బాధితురాలు అంధేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Read More :
Amritpal Singh: వివాహేతర సంబంధాలు.. వీడియో కాల్స్లో కిస్సులు.. ప్లేబాయ్గా ఖలిస్తానీ నేత
Hyderabad | రూ.50 కోసం తగాదా.. స్నేహితుడిని కత్తితో పొడిచిన వ్యక్తి
Viral News | నా భార్యకు దోమలు కుడుతున్నాయి అంటూ భర్త ట్వీట్.. పోలీసుల స్పందన ఏంటో తెలుసా..?