Mosquito Coil | దోమల (Mosquitos) బాధ నుంచి తప్పించుకోవడం కోసం ఉపయోగించే మస్కిటో కాయిల్ (Mosquito Coil) ఓకే కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలు తీసింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో శుక్రవారం చోటు చేసుకుంది. ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి (senior Delhi Police officer) జోయ్ టిర్కీ (Joy Tirkey) తెలిపిన వివరాల ప్రకారం..
శాస్త్రీ పార్క్ (Shastri Park) సమీపంలో నివాసం ఉండే ఓ కుటుంబం దోమలు కుట్టకుండా ఉండేందుకు రాత్రి పడుకునే ముందు ఇంట్లో మస్కిటో కాయిల్ (Mosquito Coil) వెలిగించారు. దాన్నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ (carbon monoxide) వాయువును పీల్చారు. దీంతో ఊపిరాడక నిద్రలోనే ఆ కుటుంబంలోని ఆరుగురు ప్రాణాలు విడిచినట్లు జోయ్ టిర్కీ వెల్లడించారు. మరణించిన ఆరుగురిలో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జోయ్ టిర్కీ వెల్లడించారు.
Also Read..
Parineeti Chopra | త్వరలో ఆప్ ఎంపీతో హీరోయిన్ వివాహం.. కన్ఫమ్ చేసిన సింగర్
Crime News | ప్రియుడితో పారిపోయేందుకు స్కెచ్.. ఎవరికీ అనుమానం రాకుండా తనలాగే ఉన్న యువతిని హత్య చేసి
India Corona | రెండో రోజూ మూడు వేలకుపైనే కొత్త కేసులు.. 15వేల మార్క్ను దాటిన యాక్టివ్ కేసులు
Elon Musk | ట్విట్టర్లో రికార్డు సృష్టించిన మస్క్.. ఒబామాను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి