హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్లో విషాదం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్లోని రహ్మత్నగర్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మణ్ అనే యువకుడు తాను కిరాయికి ఉంటున్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. గదిలోనుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కొన్నిరోజుల క్రితం భార్య తరఫు బంధువులు అతనిపై దాడిచేశారని, మనస్తాపంతో లక్ష్మణ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..