మేడ్చల్ మల్కాజిగిరి : రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అతివేగంతో దూసుకొచ్చిన ఓ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన జిల్లాఓని పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన సందెల్ రాంచంద్ర(32) వృత్తిరీత్యా మేస్త్రీ పని చేస్తూ జీవనం గడుపుతున్నాడు.
కాగా, బుధవారం సాయంత్రం సమయం బయటకు వెళ్లి వస్తానని చెప్పి గంగస్థాన్ నుంచి కొంపల్లి వైపుకు రోడ్డు దాటుతుండగా.. అదేమార్గంలో వస్తున్న ఓ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రాంచంద్ర తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహన డ్రైవర్ను అదుపులోకి తీసుకొన్నారు. మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో భారీగా చేరికలు
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ప్రారంభం
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ