సిద్దిపేట: అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నతమూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన నేతృత్వంలో రూపొందిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉందని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని పాత బస్టాండ్ కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సమసమాజ స్థాపన, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారన్నారు.
అంబేద్కర్ బాటలో పయనించి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను కేసీఆర్ నేతృత్వంలో సాకారం చేసుకున్నామని వెల్లడించారు. దళిత్ ఎంపవర్మెంట్ కింద బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటున్నామని చెప్పారు. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..