న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్తో ప్రధాని భేటీ కానున్నారు. సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలన్ని అంశాన్ని ఆయన సమీక్షించనున్నారు. ప్రధాని నిర్వహించే సమావేశంలో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శితో పాటు ఇతర అధికారులు పాల్గొనున్నారు. ఢిల్లీలో సుమారు ఆరు లక్షల మంది చిన్నారులు సీబీఎస్ఈ పరీక్షలు రాస్తున్నారని, అయితే ఆ పరీక్షల కోసం సుమారు లక్ష మంది టీచర్లు విధులు నిర్వహించాల్సి ఉంటుందని, పరీక్షలు వేళ అవే హాట్స్పాట్ సెంటర్లుగా మారుతాయని, దీంతో కరోనా వ్యాప్తి జరుగుతుందని, చిన్నారి విద్యార్థుల జీవితాలు, ఆరోగ్యం ముఖ్యమని, అందుకు సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలని నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. పరీక్షల కోసం ఇతర ప్రత్యామ్నాయ విధానాలను ఆలోచించాలన్నారు. ఆన్లైన్ విధానం లేదా ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా పిల్లలను ప్రమోట్ చేయాలని సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.