హైదరాబాద్, ఆగస్టు 17: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఇంద్రజల్, సిగ్మా సంస్థలు మరో భారీ ప్రాజెక్ట్ను చేజిక్కించుకున్నాయి. జాయింట్ వెంచర్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.155 కోట్ల యాంటీ-డ్రోన్ ఆర్డర్లు లభించాయని పేర్కొన్నాయి. ఈ ఆర్డర్ సరిహద్దు భద్రత, వీఐపీ రక్షణ, నగర భద్రతకు సంబంధించిన అప్లికేషన్లు కూడా ఉన్నాయి.
వీటిలో రూ.145 కోట్ల విలువైన ఆర్డర్ సరిహద్దు భద్రతకు సంబంధించినది కాగా, మిగతా రూ.10 కోట్లు వీఐపీ రక్షణ, నగర భద్రతకు సంబంధించినవని పేర్కొన్నది.