ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని 8వ డివిజన్ పరిధి బాలప్పేట తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు భూక్యా బాషా, అజ్మీరా భీక్యాల ఆధ్వర్యంలో సుమారు వంద కుటుంబాలు టీఆర్ఎస్లో చేరాయి.
ఈ సందర్భంగా బుధవారం బాలప్పేట తండాలో ఏర్పాటుచేసిన చేరికల సభకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ను గడపగడపకూ తీసుకెళ్లి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీజెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
ఖమ్మం నగరం పాండురంగాపురానికి చెందిన కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకుడు షేక్ రజీం కూడా బుధవారం మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
జ్ఞానాన్ని ఎల్లలు దాటించిన అంబేద్కర్: మంత్రి హరీశ్
ఖమ్మంలో ఆక్సిజన్ ఉత్పత్తి సెంటర్ ప్రారంభం
IPL 2021: అభిమానులకు షారుక్ ఖాన్ క్షమాపణ
అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ