రంగారెడ్డి : అడవి పందుల బెడద నుంచి వరి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు వరి పంట చుట్టూ పెట్టిన కరెంట్ తీగలకు ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం…షాబాద్ మండలంలోని బోనగిరిపల్లి గ్రామానికి చెందిన లింగాల జంగయ్య (60) గురువారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లి వస్తుండగా పక్క పొలంలో వరిపంటను అడవిపందుల బెడదనుండి కాపాడేందుకు ఓ రైతు తన పంట చుట్టూ పెట్టిన కరెంట్ తీగలకు తగిలి జంగయ్య మృతిచెందాడు. మృతుడి భార్య శివమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అశ్రు నయనాలతో చందూలాల్కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఈ పంచాయతీ ఆపరేటర్స్ అసోసియేషన్ బృందం
22 కోట్ల విలువైన అయోధ్య విరాళాల చెక్కులు బౌన్స్