మనోహరాబాద్ /మెదక్ : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి పీటీ గ్రామానికి చెందిన మోత్కు స్వామి (32) మద్యానికి బానిసై తరుచూ ఇంట్లో గొడవపడేవాడు. కాగా శనివారం మద్యం సేవించిన స్వామి భార్య అనితతో గొడువ పడి గ్రామ శివారులో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజుగౌడ్ వివరించారు.
ఇవి కూడా చదవండి..
ధోనీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్
TRS |టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల సందడి
ప్రజలారా వానలతో జర పైలం: కేరళ సీఎం