మేడ్చల్ మల్కాజిగిరి : తీవ్రమైన కడుపునొప్పితో భాదపడుతున్న ఓ వ్యక్తి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం..సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్కు చెందిన బొమ్మ అశోక్(45) తన భార్య లావణ్యతో పాటు ఇద్దరు కూతుర్లతో కలిసి కలిసి కొంపల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. భార్యభర్తలు ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోశించుకుంటున్నారు. కాగా, అశోక్ గత నెల రోజుల నుంచి తీవ్రమైన కడుపునొప్పితో భాదపడుతున్నాడు.
నొప్పి అధికం కావడంతో భరించలేక సోమవారం ఇంట్లో భార్యపిల్లలు ఉన్న సమయంలో అదే ఇంటి రెండోఅంతస్తు నుంచి కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
రేపటి నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
అక్రమంగా పట్టా చేసుకున్నాడని.. పంట పొలంలోనే కట్టేశారు
ఇల్లందకుంటలో దళితుల భారీ ర్యాలీ