మెదక్ : చిరుతపులి మృతదేహం ఓ చెరువులో బయటపడిన సంఘటన జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ అటవీ ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఖాజాపూర్ అటవీ ప్రాంతంలోని పటేల్ చెరువులో చిరుతపులి మృతదేహాన్ని పశువుల కాపరులు చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, రామాయంపేట రేంజర్ ఆఫీసర్ నజీయా, తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని చిరుతపులి మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు.
చిన్నశంకరంపేట పశువైద్యాధికారి గీతమాలికను రప్పించి సంఘటన స్థలం వద్దనే పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం చిరుతపులి మృతదేహాన్ని సంఘటన స్థలం వద్దనే ఖననం చేశారు. రెండు మూడు రోజుల క్రితం చిరుతపులి చెరువులోపడి మృతి చెంది ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. పోస్టుమార్టం ద్వారా సేకరించిన శ్యాంపిల్స్ను పరీక్షల నిమిత్తం సంగారెడ్డికి తరలించారు. పోస్టుమార్టంలో చిరుత మృతదేహంపై ఏదుకొయ్య గుచ్చుకొని ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా డీఎఫ్వో జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. చిరుతపులి ఏదు రెండు కొట్లాడుకుంటూ వచ్చి చిరుతపులి చెరువలో పడి మృతిచెంది ఉండవచ్చని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి..
72 టీఎంసీలకు చేరిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్
కరోనాతో చనిపోయింది 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది!
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన