మణికొండ : మణికొండ మున్సిపాలిటీ పుప్పలగూడ గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఈ నెల 25న కురిసిన భారీ వర్షానికి వరద నీటి కాలువలో ఓ వ్యక్తి గల్లంతై దుర్మరణం చెందిన ఘటన పై జిల్లా కలెక్టర్ శర్మన్ తీవ్రంగా స్పందించారు.ఈ మేరకు మంగళవారం మురుగు నీటి కాలువ నిర్మాణం పనుల్లో ముందస్తు హెచ్చరిక బోర్డులు, భారీ కేడ్లను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్ రాజ్కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ ఎఈ ఎన్. విఠోబాను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శర్మన్ ఉత్తర్వులను జారీ చేశారు. అదే విధంగా వరద కాలువలో గల్లంతై మృతి చెందిన రజనీకాంత్ కుటుంబానికి ప్రభుత్వం తరుపున ఐదు లక్షల ఎక్స్గ్రేషియాను అందించాలని మణికొండ మున్సిపల్ కమిషనర్ జయంత్ను అదేశించారు.