Rajasthan | ట్రక్కు డ్రైవర్ చేసిన ఘోర తప్పిదానికి ఓ కుటుంబం బలైంది. ఈ ఘటన రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలో ఆదివారం చోటు చేసుకోగా.. తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ కుటుంబం సికార్ జిల్లా నుంచి రణతంబోర్లోని త్రినేత్ర గణేష్ ఆలయానికి కారులో బయల్దేరింది. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు సవాయ్ మాధోపూర్ (Sawai Madhopur) జిల్లాలోని బనాస్ నది వంతెన సమీపంలో ఢిల్లీ- ముంబై ఎక్స్ప్రెస్ వేపైకి రాగానే ఓ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ముందు వెళ్తున్న ఆ ట్రక్కు ఒక్కసారిగా రాంగ్ యూ టర్న్ (Truck Taking wrong U Turn) తీసుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతులను మనీశ్ శర్మ, అతడి భార్య అనితా శర్మ, సతీశ్ శర్మ, పూనమ్, సంతోష్, కైలాష్గా గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మనన్, దీపాలి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్రక్కును సీజ్ చేశారు. ప్రస్తుతం ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Sawai Madhopur Accident Live Video: सवाई माधोपुर हादसे का लाइव वीडियो आया सामने, देखें कैसे एक गलती से खत्म हो गया पूरा परिवार https://t.co/OE1kSYp8vC #Sawaimadhopur #Sikar #Accident pic.twitter.com/FKFNSwNsvc
— FM SIKAR 89.6 (@FMSIKAR) May 8, 2024
Also Read..
Bomb Attack | దేవుడికి దండం పెట్టుకుని.. ఇంటిపై బాంబులు విసిరి.. షాకింగ్ వీడియో
Mumbai School | పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్పై వేటు