Smriti Irani | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పొరుగుదేశం పాకిస్థాన్కు చెందిన మాజీ మంత్రి ప్రశంసలు కురిపించడంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) తాజాగా స్పందించారు. పాక్ నేతలతో రాహుల్కు ఉన్న సంబంధం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈమేరకు మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె రాహుల్పై విరుచుకుపడ్డారు.
‘నేను ఇప్పటి వరకూ ఓ కాంగ్రెస్ నాయకుడితో పోరాడాను. కానీ, ఇప్పుడు పాక్ నాయకుడు ఒకరు స్మృతి ఇరానీని ఓడించాలని అన్నారు. వాళ్లు ముందు వారి దేశం గురించి ఆలోచించాలి. వాళ్లు వారి దేశాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు కానీ, అమేథి గురించి ఆందోళన చెందుతున్నారు. నా గొంతు పాక్ నాయకుడి వద్దకు చేరితే ఆయనకు నేను ఒకటి చెప్పదల్చుకున్నా. సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదులను హతమార్చేందుకు అమేథిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏకే 203 రైఫిల్స్ ఫ్యాక్టరీ (AK rifle factory)ని స్థాపించాం’ అని స్మృతి ఇరానీ అన్నారు.
రాహుల్ గాంధీపై పాకిస్థాన్ మాజీ మంత్రి సీహెచ్ ఫవాద్ హుస్సేన్ (Fawad Ahmed Hussain Chaudhry) పొగడ్తలు వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రాహుల్ మంచి ఫైర్ మీదున్నాడంటూ రాసుకొచ్చారు. అయితే పాక్ నేత పోస్ట్ను రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ ఖండించలేదు. దీనిపై స్మృతి ఇరానీ స్పందిస్తూ.. రాహుల్కు పాక్నేతలతో ఉన్న సంబంధం ఏంటి అని ప్రశ్నించారు.
Also Read..
PM Modi | వేములవాడ రాజన్న ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
Mumbai School | పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్పై వేటు
Dog | లిఫ్ట్లో బాలికపై దాడి చేసిన శునకం.. వీడియో