రంగారెడ్డి : పాము కాటుతో ఓ రైతు మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని
కేశంపేట మండలం పుట్టోనిగూడలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. గ్రామానికి చెందిన పట్నం వెంకటయ్య (46) అనే రైతు గత నెల 28న సాయంత్రం తన వరి పంటను పరిశీలిస్తుండగా పాటు కాటు వేసింది.
పాము కరిచిన విషయాన్ని వెంకటయ్య తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబ సభ్యులు వెంకటయ్యను చికిత్స నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానకు తరలించారు.
చికిత్స పొందుతూ వెంకటయ్య ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సంఘటనపై మృతుడి సోదరుడు పట్నం భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భార్యను వేట కొడవలితో నరికి చంపిన భర్త
బైక్ను ఢీకొట్టిన లారీ..ఆర్ఎస్ఐ మృతి
రంజాన్ కిట్లను పంపిణీ చేసిన మంత్రి అల్లోల
సీనియర్ ఫొటోగ్రాఫర్ సలీం మృతి పట్ల మంత్రి వేముల సంతాపం