కంది/సంగారెడ్డి : ఓ దాబాలోని రెస్ట్ రూంలో నగదును అపహరించుకు పోయిన నిందితుడిని సంగారెడ్డి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి డీఎస్పీ వెల్లడించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా కు చెందిన జాక్రాన్ జాహిద్ (21) ఈ నెల 19న సంగారెడ్డిలోని జామ్ జామ్ దాబాకు చెందిన రెస్ట్ రూంలోని అల్మారాలో ఉన్న రూ. 10 లక్షలు అపహరించుకు పోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు.
శుక్రవారం లింగంపల్లి చౌరస్తా వద్ద నిందితుడు ఉన్నారన్న సమాచారం మేరకు అతని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుని వద్ద నుంచి రూ.5 లక్షలు పోలీసులు రికవరీ చేసి రిమాండ్కు తరలించారు. కేసును చాకచక్యంగా చేదించిన సంగారెడ్డి రూరల్ సీఐ శివలింగం, ఎస్ఐ సుభాష్ ఇతర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కొల్లాపూర్ తహసీల్దార్ మృతి
అంకిరెడ్డిపల్లిలో బ్లాక్ ఫంగస్తో వ్యక్తి మృతి
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి