సిద్దిపేట : అనుమానాస్పదస్థితిలో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన సంఘటన గజ్వేల్ పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన పంది ఇస్తారి (38) డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
అయితే ఉదయం భార్య మణెమ్మకు గజ్వేల్కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన భర్త 12 గంటల వరకు ఇంటికి రాలేదు. దీంతో మణెమ్మరెండు సార్లు ఫోన్ చేసినా కట్ చేశాడన్నారు. తరువాత కొద్ది నిమిషాలకే తన భర్త కల్లు దుకాణం ఎదుట అపస్మారకస్థితిలో పడి ఉన్నట్లు మణెమ్మకు ఫోన్ చేసి చెప్పారన్నారు.
వెంటనే అక్కడికి చేరుకొని ఇస్తారిని 108 సాయంతో గజ్వేల్ దవాఖానకు తరలించగా వైద్యులు పరీక్షించి అతను చనిపోయినట్లు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన లారీ..
జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విధ్వంసం
Hyderabad | భర్తకు మద్యం తాగించి భార్యపై హత్యాచారం