Dalit woman | బీహార్ (Bihar)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత మహిళని (Dalit woman) పోలీసు అధికారి (Bihar police) చితకబాదాడు. ఈ ఘటన సీతామర్హి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ కిడ్నాప్ కేసులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలు వీధిలో కొట్టుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి .. దళిత మహిళను కర్రతో దారుణంగా కొట్టాడు (thrashed). సదరు పోలీసును సురాసంద్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రాజ్కిషోర్ సింగ్గా గుర్తించారు. స్థానికులు చూస్తుండగానే యూనిఫాంలో ఉన్న రాజ్ కిషోర్ మహిళను చితకబాదాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియో చూసిన నెటిజన్లు, స్థానికులు పోలీసు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అతడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఘటనపై సీతామర్హి ఎస్పీ మనోజ్ కుమార్ తివారీ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం సదరు పోలీసు అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మనోజ్ వెల్లడించారు.
Also Read..
Arvind Kejriwal | జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. పార్టీ కార్యకర్తలతో కేజ్రీవాల్
Coronavirus | 636 కొత్త కేసులు.. మూడు మరణాలు
Srinagar | చలిగుప్పిట్లో అందాల శ్రీనగర్.. భారీగా పతనమైన ఉష్ణోగ్రతలు