జోగులాంబ గద్వాల : అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భార్య అతని అడ్డు తొలగించుకోవాలనుకుంది. తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి భర్తను హత్య చేసింది. ఎసీపీ రంజన్ రతన్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన రాజు అతని భార్య మాధవి గద్వాల మండలం తూర్పుపల్లి గ్రామంలో బత్తాయి తోటలో పని చేస్తున్నారు.
కాగా, మాధవికి మక్తల్ మండలం కలవల దొడ్డి గ్రామానికి చెందిన మునేష్తో పెండ్లికి ముందు పరిచయం ఉండడంతో అతనితో అక్రమ సంబంధం నెరిపినట్లు ఏసీపీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు. ఈ విషయమై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో ఎలాగైనా భర్తను చంపాలని మాధవి నిర్ణయించుకుంది.
ఈ విషయం తన ప్రియుడు మునేష్కు తెలియజేసి ఈ నెల 2న హత్యకు ప్లాన్ వేసినట్లు చెప్పారు. ఆ రోజు రాత్రి భార్య మాధవి రాజుకు అన్నంలో మత్తు ట్యాబ్లెట్లు కలిపి భోజనం వడ్డించింది. రాజు మత్తు లోకి జారుకోగానే అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రియుడితో పాటు అతని మిత్రులు కుంటి జైపాల్, బోయ రవి, రవీంద్ర గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండాచేసి హత్య చేశారు.
హత్యను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించి రాజు శవాన్ని పొలంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర పడేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మాధవిని అదుపులోకి తీసుకొని విచారించగా భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Esha Gupta | ఇషా గుప్తా బికినీ సెగలు
తనను నిర్బంధించిన గదిని ఊడ్చిన ప్రియాంకా గాంధీ.. వీడియో వైరల్
Pandora Papers | ఏంటీ పండోరా పేపర్స్.. సచిన్ విదేశీ ఆస్తులపై ఏం చెప్పింది?