Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కూతురు తన తల్లిన చంపి ట్రాలీ బ్యాగ్ లో (Trolley Bag) కుక్కింది. అనంతరం మృతదేహంతో పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ (West Bengal) కు చెందిన 39 ఏళ్ల మహిళ ఫిజియోథెరపిస్ట్. మైకో లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటోంది. అయితే తన తల్లితో సదరు మహిళకు తరచూ గొడవ చోటు చేసుకునేది. దీంతో విసుగెత్తిన ఫిజియోథెరపిస్ట్ ( physiotherapist ) తన తల్లిని హతమార్చింది. అనంతరం తల్లి శవాన్ని సూట్కేసులో కుక్కి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లింది. తల్లిని హత్య చేశానని చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోయింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Bengaluru Rains | బెంగళూరును ముంచెత్తిన వర్షం.. నదులను తలపిస్తున్న కాలనీలు
Hyderabad | ఇన్స్టాగ్రామ్లో రేటింగ్ పేరుతో మోసం.. కోటిన్నర పోగొట్టుకున్న మహిళా టెక్కీ
Jack Dorsey: భారత ప్రభుత్వం వత్తిడి తెచ్చింది.. ట్విట్టర్ మాజీ సీఈవో ఆరోపణ