న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తమపై ఒత్తిడి తెచ్చినట్లు ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డార్సీ(Jack Dorsey) ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేపడుతున్న సమయంలో కొందరి అకౌంట్లను బ్లాక్ చేయాలని కోరుతూ భారత సర్కార్ తమపై వత్తిడి తెచ్చినట్లు డార్సీ పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానల్ బ్రేకింగ్ పాయింట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశీ ప్రభుత్వాల నుంచి ఏవైనా వత్తిళ్లు వచ్చాయా అని ప్రశ్న వేయగా ఆయన ఇండియా గురించి ప్రస్తావించారు.
రైతుల నిరసన ప్రదర్శన సమయంలో తమకు ప్రభుత్వం నుంచి చాలా అభ్యర్థనలు వచ్చాయని, గవర్నమెంట్ పట్ల వ్యతిరేకంగా ఉన్న జర్నలిస్టులను నియంత్రించేందుకు ప్రయత్నించారని, లేదంటే ట్విట్టర్ను మూసివేస్తామని బెదిరించాని జాక్ డార్సీ తన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తమ ఉద్యోగుల ఇండ్లను కూడా తనిఖీ చేశారన్నారు. ఒకవేళ తమ ఆదేశాలు పాటించకుంటే ఇండియాలో ఉన్న ఆఫీసులను మూసివేస్తామని కూడా హెచ్చరించినట్లు డార్సీ తెలిపారు. ప్రజాస్వామ్య భారత దేశంలో ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నట్లు మాజీ సీఈవో ఆరోపించారు.
Jack Dorsey, former Twitter CEO alleges that during the farmer protest Indian govt pressurized us(Twitter) and said we will shut down Twitter in India, raid the homes of your employees if you don’t listen to us. pic.twitter.com/tnNYta5G20
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 12, 2023
2021లో ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి జాకీ డార్సీ తప్పుకున్నారు. టర్కీ, నైజీరియా ప్రభుత్వాలు కూడా ఇండియా తరహాలోనే వ్యవహరించినట్లు వెల్లడించారు. జాక్ డార్సీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. డార్సీ చెప్పింది పచ్చి అబద్దమని అన్నారు. భారతీయ చట్టాలతో సంబంధం లేదన్నట్లుగా ట్విట్టర్ సంస్థ వ్యవహరించిందని మంత్రి ఆరోపించారు. భారతీయ చట్టాలకు లోబడే విదేశీ కంపెనీలు ఉండాలన్న నిబంధనను తమ ప్రభుత్వం పాటిస్తుందన్నారు.
జనవరి 2021 సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి జరిగిందని, ఓ దశలో మారణహోమం జరిగినట్లు ఫేక్ వార్తలు వ్యాపించాయని మంత్రి తెలిపారు. అయితే తప్పుడు సమాచారాన్ని ట్విట్టర్ ఫ్లాట్ఫామ్ నుంచి తొలగించాలని ఆదేశించామన్నారు. ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆ చర్యలు తీసుకున్నామన్నారు. జాక్ డార్సీ సీఈవోగా ఉన్న సమయంలో ఎక్కువగా ఫేక్ వార్తలు వ్యాపించినట్లు మంత్రి రాజీవ్ ఆరోపించారు. ఎవరిపైనా సోదాలు జరగలేదన్నారు. ఎవర్నీ జైలుకు పంపలేదన్నారు.
This is an outright lie by @jack – perhaps an attempt to brush out that very dubious period of twitters history
Facts and truth@twitter undr Dorsey n his team were in repeated n continuous violations of India law. As a matter of fact they were in non-compliance with law… https://t.co/SlzmTcS3Fa
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) June 13, 2023